Saturday, July 12, 2014

రీ షెడ్యూల్‌కు ఆర్బీఐ ఓకే

చంద్రబాబు ఎన్నికల హామీగా ఉన్న రైతు రుణ మాఫీ అమలుకు మరిన్ని నెలలుపట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రైతులకు తాత్కాలిక ఉపశమనం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐతో జరిపిన చర్చలు కొంతమేరకు ఫలించాయి. రాష్ట్రంలోని 572 మండలాల్లో దాదాపు పదినుంచి పదకొండు వేల కోట్ల రూపాయల పంట రుణాలను రీ షెడ్యూల్ చేసేందుకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి సంకేతాలు వచ్చాయి. ఇది కేవలం గత ఏడాది ఖరీఫ్ పంట రుణాలకు మాత్రమే వర్తిస్తుంది. ఈనెల 14న ఆర్బీఐ నుంచి ఆదేశాలు వెలువడే అవకాశాలున్నాయి.

No comments:

Post a Comment